వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఉపాధి కూలీలు నిరసనకు దిగారు. వారం రోజులుగా పనులు కల్పించకపోవడం, టెక్నికల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంపై వారు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పని చేసిన రోజులకు మస్టర్లు వేయకుండా కోత విధించారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు కల్పించాలని కోరుతూ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

