Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సూరంపేటలో ఏనుగుల సంచారం: ప్రజలు అప్రమత్తం

kumar Jun 19, 2026 10:45 AM మన్యం జిల్లా 10 viewsabout 2 hours ago
సూరంపేటలో ఏనుగుల సంచారం: ప్రజలు అప్రమత్తం - Udayam Digital
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేట జీడి తోటలోకి ఎనిమిది అటవీ ఏనుగుల గుంపు ప్రవేశించినట్లు అధికారి మణికంటేష్ తెలిపారు. వారం క్రితం ఒడిశా వెళ్లిన ఈ గుంపు తిరిగి సాలూరు, మక్కువ మండలాల మీదుగా ఇక్కడికి చేరుకుంది. ఏనుగులు జమదాల మీదుగా సూరంపేటకు రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది సూచించారు.

Comments

G
Loading comments...