వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రేటర్లో పెరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు
శిరీష గౌడ్ Jun 27, 2026 5:07 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 500 బస్సులు ఉండగా, డిసెంబరు నాటికి మరో 500 జోడించి, రెండేళ్లలో మొత్తం 2800 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
2027 నాటికి గ్రేటర్ పరిధిలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 26 డిపోలలో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, ప్రయాణీకుల కోసం సేవలను విస్తరిస్తున్నారు.
Comments
Loading comments...