వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల నగరవాసులు ఈ-సైకిళ్లపై మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీటి అమ్మకాలు రెండు నెలల్లోనే 25 శాతం పెరిగాయి. కార్లు ఉన్నవారు సైతం వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మోడళ్లు ఒకసారి చార్జ్ చేస్తే 40 నుండి 100 కి.మీ. మైలేజ్ ఇస్తున్నాయి. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉండటంతో ఆన్లైన్, ఆఫ్లైన్లలో వీటి కొనుగోళ్లు జోరందుకున్నాయి.
Comments
Loading comments...

