వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురి మృతదేహాలను వెంటనే స్వస్థలాలకు పంపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన బిలియనీర్ డా.షంషీర్ వయలిల్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేసేందుకు ‘బుర్జీల్’ ప్రతినిధులను ఎమ్మెల్యే హైదరాబాద్కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

