Back to feed
విద్యుత్ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్లు
Ravi Shukla Jun 01, 2026 5:23 AM అమరావతి 3 viewsabout 2 hours ago

ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్ల తనిఖీలకు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించనుంది. డ్రోన్ల ద్వారా తీసే ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో విశ్లేషించి, లైన్లలోని లోపాలను ముందస్తుగానే గుర్తించనున్నారు.
ప్రయోగాత్మకంగా 8,500 కిలోమీటర్ల మేర ఈ లైన్ల ప్యాట్రోలింగ్ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇది విజయవంతమైతే మొత్తం 33 వేల కిలోమీటర్ల పరిధికి విస్తరిస్తారు.
Comments
Loading comments...



