Back to feed
ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డాక్టర్ శ్రీలత నాయుడు
Harika Jun 13, 2026 9:43 AM నల్గొండ 20 views2 days ago

నల్లగొండకు చెందిన ప్రముఖ ప్రసూతి, స్త్రీ రోగ వైద్య నిపుణురాలు డాక్టర్ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక 'ఎంఆర్సీఓజీ' (MRCOG) అంతర్జాతీయ అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఈ గుర్తింపును అందించింది.
గత పదేళ్లుగా నల్లగొండలో వైద్య సేవలు అందిస్తున్న ఆమె, వంధ్యత్వ చికిత్సలు మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సల్లో విశేష కృషి చేస్తున్నారు. ఆమె సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు జిల్లా వైద్య రంగానికి గర్వకారణమని సహచర వైద్యులు, ప్రముఖులు అభినందించారు.
Comments
Loading comments...



