Back to feed
కట్న వేధింపుల కేసు: నిందితుడికి జైలు శిక్ష
Suhana Mehta Jun 04, 2026 6:48 AM సిద్దిపేట 3 viewsabout 2 hours ago

అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో సిద్దిపేట వాసి కొత్వాల్ సందీప్కు ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఒకటవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తరుణి తీర్పు వెలువరించారు.
సందీప్ వేధింపులు భరించలేక బాధితురాలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
Comments
Loading comments...


