Back to feed
శ్రీవారికి రూ.1.33 కోట్ల భారీ విరాళం
Rohit Singh May 30, 2026 6:31 AM తిరుపతి 5 viewsabout 12 hours ago

తిరుమల శ్రీవారికి భక్తురాలు నీరా రాడియా రూ.1.13 కోట్ల విలువైన విద్యుత్ బస్సుతో పాటు రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్లను విరాళంగా ఇచ్చారు. ఆలయం వద్ద వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తాళాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు.
ఈ ట్యాబ్లను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కమాండ్ సెంటర్ కోసం ఉపయోగించనున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా త్వరలోనే అన్ని డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Loading comments...


