వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గోదాముల కొరత ఉంటే ఫంక్షన్ హాళ్లను వాడుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

