వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చారిత్రక వరంగల్ వేయి స్తంభాల దేవాలయంలో శనివారం భక్తులు, పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. పాఠశాలల వేసవి సెలవులు ముగింపునకు రావడం, దానికి తోడు వీకెండ్ కావడంతో నగర వాసులతో పాటు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇక్కడ కొలువైన శ్రీ రుద్రేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం, కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళా చాతుర్యాన్ని వీక్షిస్తూ సందర్శకులు ఆలయ ప్రాంగణంలో రకరకాల ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ అక్కడ ఎంతో సందడి చేశారు.
Comments
Loading comments...

