వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
ప్రస్తుతం స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

