వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో శీతాకాలానికి ముందే కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు తగిన చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఆయన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రోడ్ల పునరుద్ధరణ పనులను అక్టోబర్కల్లా పూర్తి చేయాలని, ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను పెంచాలని మంత్రి ఆదేశించారు. పాత వాహనాల తొలగింపు, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు.
Comments
Loading comments...

