Back to feed
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం: రైతుల రాస్తారోకో
Rohit Sardana May 29, 2026 6:08 AM యాదాద్రి భువనగిరి 13 views1 day ago

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలపడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
కొనుగోళ్లను తక్షణమే వేగవంతం చేయాలని రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు స్పందించి తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...


