Back to feed
టిప్పర్ రూపంలో మృత్యువు: కార్మికుడి దుర్మరణం
Harika Jun 13, 2026 9:27 AM జనగామ 19 views2 days ago

పాలకుర్తి మండలం రామారావుపల్లిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దుర్గం మల్లయ్య (52) ప్రాణాలు కోల్పోయారు. విధులకు వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
క్వారీ టిప్పర్ల అతివేగం, ఓవర్ లోడ్ రవాణా వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



