Back to feed
నాగోల్లో ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్
Sonal Kalra May 30, 2026 7:33 AM హైదరాబాద్ 12 viewsabout 11 hours ago

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న 760 మంది ఈవ్టీజర్లకు సీపీ సుమతి ఆధ్వర్యంలో ‘సంస్కార్’ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు షీ టీమ్స్ వీరిని పట్టుకున్నాయి.
ఈ ఘటనల్లో 61 ఎఫ్ఐఆర్లు, 231 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల్లో మైనర్లు, యువకులతో పాటు 50 ఏళ్ల వయసు వారు కూడా ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...


