Back to feed
పల్లె ప్రకృతి వనంలో భవన నిర్మాణం: గ్రామస్థుల నిరసన
Harika Jun 13, 2026 9:20 AM భద్రాద్రి కొత్తగూడెం 16 views2 days ago

చుంచుపల్లి మండలం పెనగడపలో వీవో కార్యాలయ భవనాన్ని గ్రామానికి దూరంగా ఉన్న పల్లె ప్రకృతి వనంలో నిర్మించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం వనంలోని చెట్లను నరికివేయడం పర్యావరణానికి హానికరమని వారు విమర్శిస్తున్నారు.
నిర్మాణ స్థలాన్ని మార్చి, గ్రామంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. దూర ప్రాంతానికి వెళ్లడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, అధికారులు స్పందించి స్థలాన్ని పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...



