Back to feed
కోల్ ఇండియాలో 2 శాతం వాటా అమ్మకం
Vikram Singh May 27, 2026 6:09 AM అల్ ఇండియా 10 viewsabout 14 hours ago

కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 2% వాటాను విక్రయించనుంది. సుమారు 12.32 కోట్ల షేర్ల అమ్మకం ద్వారా రూ. 5,000 కోట్ల నిధులను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ. 412 గా నిర్ణయించారు.
ఈ ఓఎఫ్ఎస్ మే 27 న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు, మే 29 న రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రారంభం కానుంది. అధిక డిమాండ్ వస్తే అదనంగా మరో శాతం విక్రయించేందుకు గ్రీన్షూ ఆప్షన్ కూడా ఉంచారు.
Comments
Loading comments...



