వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో సీఎన్జీ ధరను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ.1 పెంచుతూ తాజాగా ప్రకటన వెలువడింది. రెండ్రోజుల క్రితమే కిలోపై రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో దిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.80.09కి చేరింది.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో, చమురు కంపెనీల ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను కూడా లీటరుకు రూ.3 వరకు పెంచారు.
Comments
Loading comments...

