Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సీఎన్‌జీ, ఇంధన ధరల పెంపు

Anisha Gupta May 26, 2026 5:23 AM అల్ ఇండియా 20 views1 day ago
సీఎన్‌జీ, ఇంధన ధరల పెంపు - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ధరను కిలోకు మరో రూ.2 పెంచింది. మే 15 నుంచి ఈ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.83.09కి చేరింది. గత 11 రోజుల్లోనే మొత్తం రూ.7 వరకు పెరగడంతో వాహనదారులపై తీవ్ర భారం పడనుంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.12కు, డీజిల్‌ రూ.95.20కి చేరాయి. 11 రోజుల్లో ఇంధన ధరలు రూ.7.5 మేర పెరగడం గమనార్హం.

Comments

G
Loading comments...