వార్తలకు తిరిగి వెళ్లండి
కునో పార్కులో చీతా ప్రాజెక్ట్ సమీక్ష
Vaishnavi Jun 22, 2026 7:12 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కును సందర్శించి, ప్రాజెక్ట్ చీతా పురోగతిని సమీక్షించారు. దేశంలో చీతాల పునరుద్ధరణ కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితిపై ఆమె అధికారులతో చర్చించారు.
ప్రస్తుతం భారత్లో మొత్తం 52 చీతాలు ఉండగా, వాటిలో 49 కునో పార్కులో ఉన్నాయి. స్థానిక గిరిజనులు, అటవీ సిబ్బందితో రాష్ట్రపతి భేటీ అయ్యి, ఈ ప్రాజెక్టులో వారి పాత్రను మరియు అనుభవాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...