Back to feed
కబ్జాల కోరల్లో గొలుసుకట్టు చెరువులు
Vikram Jun 11, 2026 7:09 AM నల్గొండ 5 views4 days ago

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3,541 చెరువులు, కుంటల్లో దాదాపు 50 శాతం కబ్జాకు గురయ్యాయి. భూముల ధరలు పెరగడంతో పట్టణాల్లో మట్టి పోసి ఆక్రమిస్తుండగా, పల్లెల్లో ఎఫ్టీఎల్ (FTL) పరిధిని పొలాలుగా మార్చేస్తున్నారు.
రాజకీయ నాయకుల మద్దతు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమాలు సాగుతున్నాయని ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి వీటిని కాపాడాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.
Comments
Loading comments...



