వార్తలకు తిరిగి వెళ్లండి

2019లో మద్నూర్కు కేంద్రీయ విద్యాలయం (కేవీ) మంజూరైనా, ఏడేళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ, నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్లడమే తప్ప, ఇప్పటికీ స్పష్టమైన అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి, కనీసం తాత్కాలిక భవనంలోనైనా తరగతులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

