వార్తలకు తిరిగి వెళ్లండి
యూజర్నేమ్ నిబంధనలపై కేంద్రం కసరత్తు

మెసేజింగ్ యాప్లలో యూజర్నేమ్ ఆధారిత గుర్తింపుల కోసం ఉమ్మడి నిబంధనలు తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలు పంపిన నివేదికలను ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిశీలిస్తోంది.
నకిలీ ప్రొఫైళ్లు, దుర్వినియోగాన్ని అరికట్టేలా ఒకే విధమైన పటిష్ట చట్రాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. దీనిపై స్పందించిన వాట్సాప్, తన కొత్త యూజర్నేమ్ ఫీచర్ రోలవుట్ను ప్రస్తుతానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...