Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష: మంత్రి ఉత్తమ్

Sonia Singh May 30, 2026 5:48 AM హైదరాబాద్ 15 viewsabout 13 hours ago
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష: మంత్రి ఉత్తమ్ - Udayam Digital
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ, కేంద్రం తన సేకరణ లక్ష్యాన్ని 35 శాతం తగ్గించిందని మండిపడ్డారు. దేశ యాసంగి కొనుగోళ్లలో తెలంగాణ వాటానే 60 శాతంగా ఉందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం సమస్యలు సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్నలను సేకరిస్తోందని, బీజేపీ నేతలు రాజకీయం మానాలని హితవు పలికారు.

Comments

G
Loading comments...