Back to feed
సింగరేణి అక్రమాలపై కేంద్రం మౌనమెందుకు: కేటీఆర్
Suman Gupta Jun 04, 2026 7:18 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago

సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని, దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.
చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను గురువారం పరామర్శించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ప్రభుత్వ అక్రమాలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...


