వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరులో కారు అద్దాలు పగలగొట్టి చోరీ

గుంటూరులో కారు అద్దాలు పగలగొట్టి ల్యాప్టాప్, ఐప్యాడ్ మరియు కీలక పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. విజయవాడకు చెందిన ఆవుల ఆకాశ్ తన కుమార్తెను చూసేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...