వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రోడ్డులోని అఘాపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

