Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

Follow Udayam on Google
Rohit Bhattacharya May 26, 2026 12:24 PM అనంతపురంGeneral
బస్సు బోల్తా: 30 మందికి గాయాలు - Udayam
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. లారీని తప్పించబోయి జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...