Back to feed
బస్సు బోల్తా: 30 మందికి గాయాలు
Rohit Bhattacharya May 26, 2026 6:54 AM అనంతపురం 20 views1 day ago

అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. లారీని తప్పించబోయి జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



