వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన అగ్నివీర్లలో శాశ్వత ప్రాతిపదికన కొనసాగించే వారి సంఖ్యను పెంచాలని భారత సైన్యం భావిస్తోంది. నౌకాదళంలో గరిష్టంగా 75 శాతం మందిని, ఆర్మీ, వాయుసేనల్లో 50 శాతం మందిని కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన సిబ్బందిని రక్షణ రంగంలోనే ఉంచుకోవడం ద్వారా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

