వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలోని రోహిణిలో కూలిన భవనం: సహాయక చర్యలు ముమ్మరం

ఢిల్లీలోని రోహిణి సెక్టర్ 16 పరిధిలో బుధవారం సాయంత్రం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్ మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇద్దరిని ఇప్పటికే సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలో పునరుద్ధరణ (రెనోవేషన్) పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...