Back to feed
రుణాల కోసం లంచాలు.. పొదుపు సంఘాల మహిళల పోరాటం!
Harika Jun 15, 2026 5:33 AM హైదరాబాద్ 5 viewsabout 4 hours ago

రాజేంద్రనగర్లో బ్యాంకు రుణం కోసం అధికారులు మహిళలను లంచాల కోసం వేధిస్తున్నారు. రూ.20 లక్షల రుణానికి రూ.20 వేల చొప్పున డిమాండ్ చేస్తూ, అడిగినంత ఇవ్వని వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా వసూళ్లు జరుపుతున్నట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది.
వేధింపులు భరించలేక మహిళలు తిరుగుబాటు చేయడంతో ఈ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు కమిషనర్కు నివేదిక సమర్పించారు.
Comments
Loading comments...



