వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు

రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో జైపూర్లో తీవ్ర కలకలం రేగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హైకోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా కల్పించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
Comments
Loading comments...