Back to feed
నల్లమట్టి దందా.. ప్రజల ఆందోళన
Priya Mehta May 29, 2026 5:39 AM నిజామాబాద్ 11 views1 day ago

గోదావరి పరివాహక ప్రాంతంలో అక్రమార్కులు యంత్రాలతో నల్లమట్టిని తవ్వేస్తూ సిండికేట్గా ఏర్పడ్డారు. టిప్పర్లలో నిత్యం వందల ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు.
అతివేగంతో వెళ్తున్న టిప్పర్ల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే అనేకసార్లు గ్రామస్తులు నిరసనలు చేపట్టినా, ఈ దందా ఆగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...


