Back to feed
భద్రాచలం ఆలయం: ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు
Harika Jun 13, 2026 6:49 AM భద్రాద్రి కొత్తగూడెం 13 views2 days ago

రూ. 200 కోట్ల వ్యయంతో భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కొన్ని కట్టడాలను తొలగించాల్సి ఉండటంతో, నిత్య పూజలు మరియు ముక్కోటి ఏకాదశి వంటి వార్షిక ఉత్సవాలకు ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా తాత్కాలిక ఉత్తర ద్వారం, నిత్య కల్యాణ మండపం కోసం అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధి పనులు జరుగుతున్నా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తాత్కాలిక వేదికలను సిద్ధం చేస్తున్నారు.
Comments
Loading comments...



