Back to feed
పేదలకు మెరుగైన వైద్యం కోసమే టిమ్స్: కేటీఆర్
Ravi Shukla May 15, 2026 6:34 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

పేద ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతోనే కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులను నిర్మించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన సనత్నగర్ టిమ్స్ను సందర్శించి, రోగుల సౌకర్యాలను పరిశీలించారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.1200 కోట్లతో దీనికి శంకుస్థాపన చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు దారుణంగా పడిపోయాయని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...



