Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎల్‌ విజేతగా భీమవరం బుల్స్‌

కిరణ్ కుమార్ Jul 01, 2026 12:15 AM అమరావతి 2 viewsabout 2 hours ago
ఏపీఎల్‌ విజేతగా భీమవరం బుల్స్‌ - Udayam Digital
ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-5 ఫైనల్లో సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌పై భీమవరం బుల్స్‌ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి మెరుపు అర్ధశతకాలతో కేవలం 9 ఓవర్లలోనే విజయాన్ని అందించారు. మంత్రి నారా లోకేశ్ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ విజయంతో బుల్స్ సంబరాలు అంబరాన్నంటాయి.

Comments

G
Loading comments...