Back to feed
బాసర గోదావరిలో కలుషితం: భక్తుల ఆందోళన
Ravi Shukla Jun 04, 2026 6:18 AM నిర్మల్ 7 viewsabout 3 hours ago

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని గోదావరి ఘాట్లు కలుషితమవుతున్నాయి. నదిలో వేసిన నాణేల కోసం కొందరు స్థానికులు నీటి అడుగున వెతుకుతుండటంతో, పేరుకుపోయిన వ్యర్థాలు పైకి తేలి నీరు దుర్గంధంగా మారుతోంది.
దీనివల్ల పుణ్యస్నానాలకు ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, స్నానాల సమయంలో నాణేలు ఏరడాన్ని కట్టడి చేసి, ఘాట్ల వద్ద పరిశుభ్రతను కాపాడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...


