Back to feed
బైజూస్ అధినేత రవీంద్రన్కు ఆరు నెలల జైలు శిక్ష
Rohit Chatterjee May 27, 2026 5:19 AM అల్ ఇండియా 7 viewsabout 15 hours ago

కోర్టు ధిక్కారణ కేసులో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు సింగపూర్ న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల విలువతో భారత ఎడుటెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.కరోనా సమయంలో దూసుకెళ్లిన బైజూస్కు, 2021 లో తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల విదేశీ రుణమే శాపంగా మారింది. నిధుల దుర్వినియోగం, ఆడిట్ ఆలస్యం, భారీ నష్టాల కారణంగా రుణదాతలు న్యాయపోరాటానికి దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Comments
Loading comments...


