వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల చోరీలో కీలక నిందితుడు

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో అవినాష్ శుక్లా కీలక నిందితుడని సిట్ గుర్తించింది. నగదు లెక్కించేందుకు ట్రస్ట్ ఇతడిని రూ.15 వేల జీతానికి నియమించగా, ఏకంగా 70 సార్లు నగదును దారి మళ్లించాడు.
నిందితుడి ఇంట్లోనే విరాళాల హుండీ లభ్యమవ్వడం గమనార్హం. ఇతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను బుధవారం పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్రమాల తీరును సిట్ నిర్ధారించింది.
Comments
Loading comments...