వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ కృష్ణానగర్లో ఎంఆర్పీ కంటే అధిక ధరకు సిగరెట్లు అమ్ముతున్నారని ప్రశ్నించిన విజయప్రకాశ్ (26) అనే యువకుడిపై పాన్ షాప్ యజమాని రాడ్తో దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 'పీఎస్ పాన్ మహల్' వద్ద ఈ ఘటన జరిగింది.
అధిక ధరల గురించి నిలదీసినందుకు యజమాని, మరొకరు కలిసి యువకుడిని దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

