వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. ఆర్టీఏ చలాన్ పేరుతో పంపిన ఏపీకే (APK) ఫైల్ను క్లిక్ చేయడంతో, ఆయన బ్యాంక్ ఖాతా నుండి రూ. 49,139 డ్రా అయ్యాయి.
ఖాతా నుండి నగదు కట్ అవ్వడాన్ని గమనించిన ఏఎస్సై, వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత ఫైల్స్, లింక్స్పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

