వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ల సవరణలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రజా సంఘ నాయకుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నగరంపాలెంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఇదే అంశంపై ఈ నెల 18న ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేసినట్లు గుర్తుచేశారు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండేలా నిబంధనలకు అనుగుణంగా జాబితాలు రూపొందించాలని అన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఎన్నికల ప్రక్రియ పై స్పష్టత ఇవ్వాలని అన్నారు.
Comments
Loading comments...

