Back to feed
ఈఎన్సీగా శ్రీనివాస్ రెడ్డి నియామకం
Vikram Chandra May 27, 2026 8:09 AM అమరావతి 9 viewsabout 12 hours ago

రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇన్చార్జి ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ)గా ఎల్. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రధాన రహదారుల చీఫ్ ఇంజనీర్గా, ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comments
Loading comments...



