Back to feed
ఏపీ టెక్స్టైల్ రంగంపై సమీక్ష
Ravi Singh May 30, 2026 7:17 AM అమరావతి 12 viewsabout 12 hours ago

ఆంధ్రప్రదేశ్లో చేనేత, హస్తకళలు, పట్టు పరిశ్రమ రంగాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సమీక్షించారు. టెక్స్టైల్ రంగంలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.
బడ్జెట్ 2026 కేటాయింపులు, టెక్స్టైల్ ఎక్స్పో, ఎగుమతుల విజన్ 2030 ఆధారంగా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచాలని నిర్ణయించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పారిశ్రామికవేత్తల పరస్పర సహకారంతో పట్టు పరిశ్రమను మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...


