Back to feed
ఆరు నెలల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలు
Deepika Suresh May 27, 2026 6:30 AM అల్ ఇండియా 10 viewsabout 13 hours ago

మత్తుపదార్థాలు, ఆయుధాల స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు వచ్చే ఆరు నెలల్లో సరిహద్దుల్లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజస్థాన్లోని బీఎస్ఎఫ్ (BSF) జవాన్లను ఉద్దేశించి ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
డ్రోన్ల ద్వారా వచ్చే పార్సిళ్లను అందుకునే దేశీయ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులతో పాటు పౌరులతో కూడిన నాలుగు అంచెల భద్రతా గ్రిడ్ను బలోపేతం చేయాలన్నారు.
Comments
Loading comments...


