Back to feed
నర్సరీ షేడ్నెట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు
Vikram Jun 11, 2026 7:21 AM కరీంనగర్ 5 views4 days ago

కరీంనగర్ జిల్లా లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణ కోసం కొనే షేడ్నెట్ల (నీడ వలలు) నిర్వహణలో భారీగా నిధులు స్వాహా అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేనివి కొనడం వల్ల అవి ఈదురుగాలులకు చినిగిపోతున్నాయి. కొన్నిచోట్ల పాతవాటికే కొత్త బిల్లులు సృష్టిస్తున్నారు.
వేల రూపాయలు వెచ్చిస్తున్నా నీడ కరువై మొక్కలు ఎదగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటా నాటే మొక్కలు మరుసటి ఏడాదికి కనిపించడం లేదు.
Comments
Loading comments...



