Back to feed
ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
Vikram Chandra May 27, 2026 9:05 AM అల్ ఇండియా 10 viewsabout 11 hours ago

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా చైనా గగనతలం నుండి వెనక్కి తిరిగింది. మొత్తం 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన ఈ విమానం, చివరకు బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ బోయింగ్ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా సంస్థ ప్రకటించింది.
Comments
Loading comments...


