Back to feed
ఏఐఏడీఎంకేకు షాక్: టీవీకేలోకి ముగ్గురు రెబల్స్
Aditi Saxena May 25, 2026 12:13 PM అల్ ఇండియా 28 views2 days ago

తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు అధికార టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ఎమ్మెల్యేలు.. ఇప్పటికే స్పీకర్, మంత్రి ఆధవ్ అర్జునలను కలిశారు. వీరిలో ఎమ్మెల్యే సత్యభామ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఈ ముగ్గురితో పాటు మొత్తం 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరంతా టీవీకేలో చేరితే ప్రభుత్వానికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ లభించనుంది.
Comments
Loading comments...


