Back to feed
సూర్యాపేటలో ప్రభుత్వ సిబ్బందికి ఏఐ శిక్షణ
Harika Jun 13, 2026 7:12 AM సూర్యాపేట 13 views2 days ago

సూర్యాపేట కలెక్టరేట్లో ప్రభుత్వ అధికారుల కోసం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'పై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా సిబ్బందికి చాట్జిపిటి, క్లాడ్ వంటి ఏఐ సాధనాలపై శిక్షణ ఇచ్చారు. పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నివేదికల తయారీ, డేటా విశ్లేషణలో ఏఐ పాత్రను వివరించారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ ప్రభుత్వ పనుల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగించేందుకు దోహదపడుతుంది.
Comments
Loading comments...



